- Advertisement -
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్: సూర్యాపేట జిల్లాలో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం డివిజన్ కమిటీ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, కార్యదర్శుల సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో అధ్యక్షురాలుగా ఎస్.మల్లేశ్వరి,ఉపాధ్యక్షులుగా ఎస్కే జహీరం ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, సహాయ కార్యదర్శిగా విను, సంయుక్త కార్యదర్శిగా ఎస్ కె మీరా ఎన్నికైనట్లు తెలిపారు.ఈ మేరకు సంఘం ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం మర్యాదపూర్వకంగా సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్ ను కలిశారు.వెంట జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



