- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ సమీపంలో గల అంతర్రాష్ట్ర ఆర్టీవో చెక్పోస్ట్ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మూతపడింది. అంతర్రాష్ట్ర ఆర్టీవో చెక్పోస్ట్ ఎత్తివేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నవతెలంగాణ అంతర్ రాష్ట్ర ఆర్టిఓ చెక్పోస్టును సందర్శించగా.. చెక్పోస్టును మూసివేసి అధికారులంతా పరారైనట్లు తెలిసింది. ఇక్కడ ప్రయివేట్ పరంగా విధులు నిర్వహించే వ్యక్తులంతా పరేషాన్ లో పడ్డారు. అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ మూత పడ్డ సందర్బంగా నవతెలంగాణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కొమ్ము శ్రీనివాస్ కు ఫోన్ చెయ్యగా.. నవతెలంగాణ ఫోన్ కాల్ ను ఆర్టీవో స్వీకరించకపోవడం గమనారం.
- Advertisement -