– రోడ్డు విస్తీర్ణ పనుల్లో ఉద్రిక్తత
– ముందస్తు సమాచారం లేకుండా జేసీ బీ లతో విరుచుకు పడ్డారని ఆరోపిస్తున్న షాపు యజమానులు
– రోడ్డు విస్తీర్ణ పనులను సాకుగా చూపి ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యానికి దిగారని ఆరోపిస్తున్న దుకాణదారులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పట్టణ సెంటర్ లైటింగ్ పనుల్లో భాగంగా శుక్రవారం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా ఆర్ అండ్ బి అధికారులు సెంటర్ లైటింగ్, సైడ్ డ్రైన్స్, రింగ్ రోడ్డు పనులను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలో రింగ్ రోడ్డు రావటంతో అధికారులు రోడ్డు పక్కన 50 అడుగులను తీసి షాపులను ఖాళీ చేపిస్తున్నారు.అయితే తమకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయని నష్టపరిహారం చెల్లించి పనులు చేసుకోవాలంటూ షాప్ యజమానులు అడ్డం తిరిగారు.ఈ క్రమంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్,గార్డ్ క్వార్టర్స్ కోసం గతంలో తగరం నాగయ్య అనే వ్యక్తి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సర్వే నెంబర్: 1167 లో ఎకరం పైన దానంగా ఇచ్చారని ఆ స్థలాల్లో ఇల్లు షాపులను ఏర్పాటు చేసుకొని తిరిగి తమ పైనే కోర్టుకు వెళ్లారంటూ ఫారెస్ట్ రేంజర్ మురళి తెలిపారు. శుక్రవారం తహసిల్దార్ రామకృష్ణ కోర్ట్ ఆర్డర్ అమలు చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగి షాపులను ఆక్రమిత ఇంటిని జేసీ బీ లతో తొలగించాలి. ఈ నేపథ్యంలోనే షాపు యజమానులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.పోలీస్ ప్రొటెక్షన్ తో ఫారెస్ట్ అధికారులు షాపును ఇళ్లను పూర్తిగా తొలగించారు. ఏటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కనీసం సామాను కూడా సర్దుకునే అవకాశం కల్పించకుండా తమను దౌర్జన్యంగా కాళీ చేయించారంటూ దుకాణదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కోర్టు లో వివాదం నడుస్తున్న అవేం పట్ట నట్టుగా ఫారెస్ట్, పోలీస్ అధికారులు వ్యవహరించారంటూ కంటెంట్ ఆఫ్ కోర్టు కింద తాము కోర్టుకు వెళుతున్నట్లు బాధితులు చెబుతున్నారు.
ఆక్రమణలు తొలగిస్తున్న అటవీ అధికారులు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES