- Advertisement -
- – మద్నూర్ ఎఫ్ పి ఓ ఆఫీసులో వీక్షించిన రైతులు
నవతెలంగాణ – మద్నూర్ - ప్రతి వారం వారం నిర్వహించే టెలి కాన్ఫరెన్స్ లో భాగంగా మద్నూర్ మండల కేంద్రంలోని ఎఫ్ పి ఓ కార్యాలయంలో చైర్మన్ చాట్ల గోపాల్ సభ్యులు వ్యవసాయ రైతులు ఢిల్లీ నుండి కృషి భవన్ టెలి కాన్ఫరెన్స్ను వీక్షించారు. వారం వారం నిర్వహించే ఢిల్లీ కృషి భవన్ టెలికాన్ ఫ్రెండ్స్ ద్వారా ఎఫ్ పి ఓ లకు సలహాలు సూచనలు అందిస్తారని ఎఫ్ పి వో లు ఎలాంటి చర్యలు చేపట్టాలి. లాభదాయకమైన పనులు ఎలా నిర్వహించుకోవాలి. వాటి పనితీరు ఎలా ఉండాలి రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి ఇలా ప్రత్యేకమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని ఎఫ్ పి ఓ చైర్మన్ చాట్ల గోపాల్ నవ తెలంగాణతో మాట్లాడుతూ వివరించారు టెలి కాన్ఫరెన్స్ను వీక్షించిన రైతులు ఎఫ్ పి ఓ ద్వారా రైతులకు ఇలాంటి సౌకర్యాలు ఉంటాయా అనే దానిపై సంతోషం వ్యక్తపరిచారు.
- Advertisement -