– నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం
– రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు
– ఇప్పటికే అధికారిక నోటీసులు జారీ చేసిన దర్యాప్తు సంస్థ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ఇప్పటికే భారీ మొత్తంలో జప్తు చేసిన ఆస్తుల స్వాధీనానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు చర్యలను ప్రారంభించిం ది. వారికి సంబంధించినదిగా చెప్పబడే యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) కొనుగోలు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ ఇప్పటికే జప్తు చేసింది. దీనిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఈడీ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ, ముంబయి లక్నోలో ఉన్న రిజిస్ట్రార్ ఆఫీసులకు ఈనెల 11నే అధికారిక నోటీసులు జారీ చేసింది. సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలనీ లేదా వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని అందులో పేర్కొన్నది. ఈ మేరకు ఈడీ ఒక ప్రకటనలో వివరించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 8, రూల్ 5(1) ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్టు ఈడీ స్పష్టం చేసింది. ఈ ఆస్తులను గతంలోనే జప్తు చేసినట్టు దర్యాప్తు సంస్థ వివరించింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఏజేఎల్ ప్రచురణకర్తగా ఉన్నది. సోనియా మరియు రాహుల్ సహా కొందరు పార్టీ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రయివేటు లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ. కాంగ్రెస్కు ఏజేఎల్ బకాయిపడిన రూ. 90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో ‘యంగ్ ఇండియన్’లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. నవంబర్ 2023లో.. ఢిల్లీ ముంబయి లక్నోలోని రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను.. రూ.90.2 కోట్ల విలువైన ఏజేఎల్ షేర్లను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ అటాచ్మెంట్ను ఈనెల 10న ఈడీ అధికారులు ధృవీకరించారు.
కేసు నేపథ్యం
ఈ కేసు వెనుక కథనాన్ని చూస్తే 2014లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో 2021లో ఈడీ ఈ కేసుపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు.. యంగ్ ఇండియన్ అనే ప్రయివేటు కంపెనీ ద్వారా రూ.2000 కోట్లకు పైగా విలువైన ఏజేఎల్ ఆస్తులను తక్కువ ధరకు స్వాధీనం చేసుకున్నారనీ, ఇది నేరపూరిత కుట్రగా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.ఈ కేసుకు సంబంధించి సోనియా మరియు రాహుల్తో పాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్లను ఈడీ ఇప్పటికే విచారించింది. వారి వాంగ్మూలాలనూ రికార్డు చేసింది. తాజాగా సంబంధిత స్థిరాస్తుల స్వాధీనానికి నోటీసులు ఇచ్చింది. ఇటీవలి న్యాయపరమైన సవాళ్ల మధ్య కూడా ఢిల్లీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఈ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతినిచ్చాయి. దర్యాప్తులో భాగంగా చంద్రగుప్త మౌలికాలు, పత్రాలు, లావాదేవీలు, ఇతర ఆధారాలను సేకరించేందుకు ఈడీ అనేక ప్రదేశాల్లో సోదాలు, స్వాధీన చర్యలు చేపట్టింది. ఇవన్నీ కలిపి చూస్తే నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయంగా మాత్రమే కాకుండా న్యాయపరంగా కూడా భారీ చర్చలకు దారి తీస్తోంది.
కాంగ్రెస్కు ఈడీ షాక్
- Advertisement -
RELATED ARTICLES