నవతెలంగాణ – హైదరాబాద్: కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై గ్లోబల్ స్టార్ రామ్చరణ్ స్పందించారు. “పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా బాధించింది. ఇటువంటి సంఘటనలకు మన సమాజంలో చోటు లేదు. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. ఈ కష్ట సమయాన్ని తట్టుకుని నిలబడే మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని దేవుడు బాధిత కుటుంబాలకు ఇవ్వాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను” అని చరణ్ పేర్కొన్నారు.
- Advertisement -