Tuesday, April 29, 2025
Homeతాజా వార్తలుపాక్ వెన్నులో వ‌ణుకు పుట్టేలా చ‌ర్య‌లు: బండి

పాక్ వెన్నులో వ‌ణుకు పుట్టేలా చ‌ర్య‌లు: బండి

నవతెలంగాణ – హైదరాబాద్: ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగా దాయాది పాకిస్థాన్ వెన్నులో వ‌ణుకు పుట్టేలా భార‌త్ చ‌ర్య‌లు ఉంటాయ‌ని కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ అన్నారు. ఎంసీహెచ్ఆర్‌డీలో నిర్వ‌హించిన రోజ్‌గార్ మేళాలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప‌హ‌ల్గామ్ పాశ‌విక దాడి ఉగ్ర‌వాదుల రాక్ష‌స‌త్వానికి ప‌రాకాష్ఠ అని అన్నారు. ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లు పాక్ ర‌క్ష‌ణ‌మంత్రి అంగీక‌రించార‌ని గుర్తుచేశారు. కానీ, తుపాకీ ప‌ట్టినోడు ఆ తుపాకీకే బ‌ల‌వుతాడ‌ని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img