– ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలి బాధిత రైతు
నవతెలంగాణ-మల్హర్ రావు : గురువారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించి మెరుపులు,ఉరుములు ప్రారంభమై చలిపిడుగు పడి మండలంలోని నాచారం గ్రామానికి చెందిన కన్నూరి అశోక్ అనే రైతుకు చెందిన రూ.35వేలు విలువగల కోడె అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత రైతు పూర్తి కథనం ప్రకారం గురువారం అర్ధరాత్రి ఒకేసారి ఈదురు గాలులు విస్తూ మెరుపుపులు ఉరుములు రావడంతోపాటు తన కోడెపై చాలిపిడుగు వేసి కోడె అక్కడిక్కడే మృతి చెందిందని కన్నీరుమున్నీరైయ్యాడు.ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
- Advertisement -