Saturday, May 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రజా ప్రయోజనాలే పత్రికల లక్ష్యం కావాలి

ప్రజా ప్రయోజనాలే పత్రికల లక్ష్యం కావాలి

- Advertisement -

– కృత్రిమ వార్తలకు చోటివ్వొద్దు
– నిజాన్ని కాపాడాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
– నవతెలంగాణ నూతన వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నిజాన్ని వెలికితీసి రాసే వార్తల వల్ల సమాజానికి మంచి జరుగుతుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంహెచ్‌ భవన్‌లో నవతెలంగాణ నూతన వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో నవతెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పి ప్రభాకర్‌, సంపాదకులు రాంపల్లి రమేశ్‌, మాజీ ఎడిటర్‌ ఆర్‌ సుధాభాస్కర్‌, బుకహేౌజ్‌ ఎడిటర్‌ కె ఆనందాచారి, జనరల్‌ మేనేజర్లు లింగారెడ్డి, ఎ వెంకటేశ్‌, రఘు, ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులు వేణుమాదవ్‌, సలీమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన విస్తృత సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ కృత్రిమ వార్తలు, లాభాల కోసం రాసే వార్తలు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబింపజేయలేవని అన్నారు. వార్తలు తప్ప అందులో వాస్తవాలు అరుదైపోయిన నేటి కాలంలో వాటి గుట్టు రట్టు చేయటమంటే.. ప్రజలు పడుతున్న బాధలను, వాటికి కారణాలను వెలికి తీయటమేనని వివరించారు. పొరలు పొరలుగా ఉన్న సమస్యలను వెలికితీసి, వాటిని తిరిగి ప్రజలకు అర్థమయ్యేలా కథనాలను రాయటమే నవతెలంగాణ పత్రికకు ప్రాముఖ్యతగా ఉండాలని సూచించారు. ప్రజలకు సత్యాన్ని మరింత చేరువ చేసేందుకు అందుబాటులో ఉండే మార్గాలేంటనేవి నిరంతరం అన్వేషణ చేయాలన్నారు. ఇందుకోసం ఆధునిక పద్ధతులను అలవర్చుకోవాలని చెప్పారు. పేదరికానికి కారణమేంటి? దళితుల పట్ల వివక్ష ఎందుకుంది? ఇవి ఎలా పోతాయి? అనే దానికంటే.. సంపన్నుడిని కావటం ఎలా? నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కింది వారి పట్ల వివక్ష చూపటం ఎలా? అనే భావాజాలం వ్యాప్తి చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు భిన్నంగా ప్రత్యామ్నాయ భావాజాలాన్ని పెంపొందించాలని వివరించారు. అన్ని హంగులున్న పత్రికలకంటే భిన్నంగా ప్రజాప్రయోజనాల దృష్టి కోణంలో మన వార్తలుండాలని సూచించారు. బీజేపీ పట్ల బీఆర్‌ఎస్‌ పార్టీ మెతక వైఖరితో ఉండటం సరికాదని కవిత లేవనెత్తిన అంశంపై చర్చించాల్సిందేనన్నారు. ఈ విషయం పట్ల పదేండ్ల కాలంలో ఆమె ఎందుకు మాట్లాడలేదనేది కూడా అనుమానమేనని తెలిపారు. ఆడవాళ్లు విస్తారంగా పని చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని నిటి ఆయోగ్‌ సమావేశం సందర్భంగా మోడీ మాట్లాడారనీ, ఈ వ్యాఖ్యలు నిజాయితీతో కూడుకున్నవేనా? అనేది పరిశీలించాలన్నారు. సనాతన ధర్మం గురించి పదే పదే చెప్పే మోడీ, బీజేపీ నేతలు..మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పడంలోని ఆంతర్యమేంటని విడమరిచి చెప్పాలని రాఘవులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -