Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభారీవర్షాలకు దెబ్బతిన్నరోడ్ల పునరుద్ధరణ

భారీవర్షాలకు దెబ్బతిన్నరోడ్ల పునరుద్ధరణ

- Advertisement -

ఆర్‌అండ్‌బీ శాఖపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పురోగతిపై సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలతో మరమ్మతుకు గురైన రోడ్ల వివరాలపై మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలోని 1062 ప్రాంతాల్లో 1370 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. 68 రోడ్లు కోతకు గురికాగా, 38 తాత్కాలిక పునరుద్ధరణ చేసినట్టు ఈఏన్సీ మోహన్‌నాయక్‌ వివరించారు. వర్షపు నీరు ఓవర్‌ ఫ్లో ఉన్న 520 రోడ్లకు గాను 478 చోట్ల తగ్గుముఖం పట్టాయన్నారు. 445 చోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడితే,375 చోట్ల పునరుద్ధరణ చేసినట్టు తెలిపారు. సుమారు 306 కోట్ల సీడీ పనులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణ కోసం అంచనాలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ. 72.49 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.1263.33 కోట్లు అవుతాయని అధికారులు వివరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పూర్తి స్థాయి, తాత్కాలిక మరమ్మతులు చేపడతామని చెప్పారు. శాశ్వత పునరుద్ధరణ కోసం మళ్ళీ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని ఆర్‌ అండ్‌ బీ ఈఎన్సీ మోహన్‌నాయక్‌ను మంత్రి ఆదేశించారు.

టిమ్స్‌ హాస్పిటల్స్‌, మెడికల్‌ కాలేజీలు, ఇంటిగ్రేటెడ్‌ జిల్లా కలెక్టరేట్ల పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. టిమ్స్‌ హాస్పిటళ్లు, మెడికల్‌ కాలేజీల పనులు వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయా లని స్పష్టం చేశారు. తుది దశకు చేరుకున్న ములుగు, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల కలెక్టరేట్లు నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి అందుబాటు లోకి వచ్చేం దుకు అధికారులు రేయింబవళ్ళు కష్టపడాలన్నారు. నారాయణ పేట, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్ల పనుల్లో వేగం పెంచాలన్నారు. ఆర్‌ అండ్‌ బీ పరిధిలో నిర్మితమవనున్న ప్రతి భవన నిర్మాణాలు ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు. నేషనల్‌ హైవేలు, పురోగతిలో ఉన్న ఫ్లై ఓవర్లపై ఆరా తీసిన మంత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. ఎన్నికల కోడ్‌ తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తానన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి హ్యామ్‌ రోడ్ల పై ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తామని మంత్రి అధికారులతో అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఈఎన్సీ మోహన్‌నాయక్‌, సీఈలు రాజేశ్వర్‌రెడ్డి, బీవీ రావు, లక్ష్మణ్‌, ఎం.శ్రీనివాస్‌ రెడ్డి, కిషన్‌రావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -