- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : మృగశిరకార్తె(మిరుగు) సందర్భంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. నగరంలోని బోధన్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం చేప ప్రసాదం అందించారు. స్థానికంగా ఉండే మహమ్మద్ అహ్మద్ కుటుంబీకులు 60 ఏళ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రసాదం కోసం జిల్లాలోని పలు మండలాలతో పాటు ఇతర జిల్లాల ప్రజలు కూడా చేప ప్రసాదం కోసం బారులు తీరారు. సుమారు 500 మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
- Advertisement -