Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామూహిక అక్షరాభ్యాసం 

సామూహిక అక్షరాభ్యాసం 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్ద కొడంగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోజున నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాని ఎంఈఓ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అన్ని సౌకర్యాలతో పాఠశాలలను ప్రారంభించిందని జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ ఉచిత భోజనం దుస్తులు పాఠ్యపుస్తకాలు వంటి అనేక వసతులతో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యా బోధన అందిస్తామనీ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్య నాయక్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమల,కాశీనాథ్, రమేష్,క్రాంతి,సౌమ్య,స్రవంతి,సారిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -