- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
1/2005 యాక్ట్ను రద్దు చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్యూపీపీటీ) కోరింది. ఈ మేరకు బుధవారం ఆర్యూపీపీటీ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ అబ్దుల్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.టి.కాంతికృష్ణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్కు వినతిపత్రం సమర్పించారు. టెట్ ఉత్తీర్ణతా మార్కులు తగ్గించాలనీ, విద్వాన్, మధ్యమ విశారదతో పండిత శిక్షణ పూర్తి చేసిన వారికి 2017 కటాఫ్ డేట్గా నిర్ణయించి డీయస్సీ రాయడానికి అనుమతించాలని కోరారు. 317 జీవో ద్వారా స్పౌజ్ క్యాటగిరీలో బదిలీ కానీ భాషోపాధ్యాయులకు వెంటనే బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -



