- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, రిజర్వేషన్తో సంబంధం లేకుండా విశాఖపట్నం-విజయవాడ మధ్య 12 సాధారణ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. ఈ రైళ్లు జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీలలో దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
- Advertisement -



