– రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు కూడా..
న్యూఢిల్లీ : భర్తృహరి మహతాబ్, రవి కిషన్తో సహా మొత్తం 17 మంది పార్లమెంట్ సభ్యులకు సంసద్ రత్న అవార్డులు ప్రకటించారు. అలాగే రెండు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. పార్లమెంట్కు చేసిన కృషికి గానూ ఎంపీలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులను ఏర్పాటు చేసింది. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ) చైరెన్ హన్స్రాజ్ అహిర్ నేతృత్వంలోని జ్యూరీ కమిటీ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది. భర్తృహరి మహతాబ్, సుప్రియా సులే (ఎన్సీపీ-ఎస్పీ), ఎన్కె ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ), శ్రీరంగ్ అప్ప బర్నే (శివసేన)లను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నలుగురు ఎంపీలు 16, 17వ లోక్సభల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని, ప్రస్తుత పదవీ కాలంలోనూ అదే పనితీరును కొనసాగిస్తున్నారని ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, సిత్మా వాగ్ (బీజేపీ), అర్వింద్ సవంత్ (శివసేన – యూబీటీ), నరేష్ గణపతి మహస్కే (శివసేన), వర్షా గైక్వాడ్ (కాంగ్రెస్), మేధా కులకర్ణి (బీజేపీ), ప్రవీణ్ పటేల్ (బీజేపీ ), రవి కిషన్ (బీజేపీ), నిశీకాంత్ దూబే (బీజేపీ), విద్యుత్ బరన్ మహతో (బీజేపీ), పిపి చౌదరీ (బీజేపీ), మదన్ రాథోడ్ (బీజేపీ), సిఎన్ అన్నాదురై (డీఎంకే), దిలిప్ సైకియా (బీజేపీ) అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. ఆర్ధికం, వ్యవసాయంపై రెండు స్టాండింగ్ కమిటీలను కూడా అవార్డుకు ఎంపిక చేశారు. ఆర్థికంపై స్టాండింగ్ కమిటీకి భర్తృహరి మహతాబ్ నేతృత్వం వహిస్తుండగా, వ్యవసాయంపై స్టాండింగ్ కమిటీకి చరణ్జిత్ సింగ్ చన్నీ (కాంగ్రెస్) అధ్యక్షత వహిస్తున్నారు.
17 మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డులు
- Advertisement -
- Advertisement -