- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హమాస్ చీఫ్ హతం అయినట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యాహు సంచలన ప్రకట చేశారు. నేడు జరుసలేమ్లో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో నెతాన్యాహు మాట్లాడుతూ.. హమాస్ నాయకుడు మహ్మద్ సిన్వర్ హతమైనట్లు వెల్లడించారు. “మేము డీఫ్, హనీయెహ్, యాహ్యా సిన్వర్ వంటి హమాస్ నాయకులను హతం చేశాం, ఇప్పుడు మహ్మద్ సిన్వర్ను కూడా హతం చేశాం” అని చెప్పారు. మహ్మద్ సిన్వర్, గాజా స్ట్రిప్ లో హమాస్ నాయకుడిగా ఉన్నాడు. అతని సోదరుడు యాహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ దళాలు 2024 అక్టోబర్లో హతం చేసిన తర్వాత ఆయన ఈ పదవిని చేపట్టాడు.
- Advertisement -