- Advertisement -
లసానె : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నూతన అధ్యక్షురాలు క్రిస్టీ కొవెంట్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య నగరం ఎంపిక ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. హోస్ట్ సిటీని ఏ సమయంలో ఎంపిక చేయాలనే అంశంలో స్పష్టత, ఈ ప్రక్రియలో ఐఓసీ సభ్యులను భాగస్వామ్యం ఉండేలా చేయటం కొత్త ప్రెసిడెంట్ లక్ష్యం. ఆతిథ్య నగరం ఎంపికకు అనుసరించాల్సిన పద్దతిని తేల్చేందుకు వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. వర్కింగ్ గ్రూప్ సిఫారసుల మేరకు 2036 ఒలింపిక్స్ ఆతిథ్య నగరం ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ ఆసక్తి వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే.
- Advertisement -