Saturday, October 18, 2025
E-PAPER
Homeజాతీయం208 మంది మావోయిస్టులు సరెండర్‌

208 మంది మావోయిస్టులు సరెండర్‌

- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌ సీఎం సమక్షంలో లొంగుబాటు

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో 208మంది మావోయిస్టులు 153 ఆయుధాలతో పాటు లొంగిపోయినట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. వారిలో సీనియర్‌ అధికారులు కూడా ఉన్నారని పేర్కొన్నాయి. 208 మంది శుక్రవారం జనజీవన స్రవంతిలోకి తిరిగివచ్చి జగదల్‌పూర్‌లోని పోలీస్‌ లైన్స్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయి, ఉప ముఖ్యమంత్రి విజరు శర్మ ఎదుట తమ ఆయుధాలను అప్పగించారు. ఆయుధాల్లో 19ఎకె-47రైఫిల్స్‌, 17ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్స్‌, 23ఐఎన్‌ఎస్‌ఎఎస్‌ రైఫిల్స్‌, ఒక ఐఎన్‌ఎస్‌ఎఎస్‌ ఎల్‌ఎంజి, 36.303 రైఫిల్స్‌, 4 కార్బైన్లు, 11 బిజిఎల్‌ లాంచర్లు, 41 12బోర్‌/సింగిల్‌ షాట్‌, ఒక పిస్టల్‌ ఉన్నట్లు వెల్లడించాయి.

208మందిలో 110మంది మహిళలు, 99మంది పురుషులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యులు ఒకరు, నలుగురు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యులు, ప్రాంతీయ కమిటీ సభ్యుడు ఒకరు, 21మంది డీవీసీఎం స్థాయి, 61మంది ఏసీఎం స్థాయి, 98మంది కేడర్‌ సభ్యులు, 22మంది పిఎల్‌జిఎ/ఆర్‌పిసి/ఇతరులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు అగ్రనేత ఆశన్న సహా 170మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఎక్స్‌ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది, మహారాష్ట్రలో 60మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -