లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణి కార్యక్రమంలో శుక్రవారం 232 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో గహ సంబంధిత దరఖాస్తులు 88, పంచాయితీ రాజ్ గ్రామీణాభివద్ధి శాఖకు సంబంధించి 101, రెవెన్యూ శాఖకు చెందిన 37 దరఖాస్తులు వచ్చాయి. పురపాలన,పట్టణాభివృద్ధికి సంబంధించిన 16 దరఖాస్తులు వచ్చాయి. కాగా ప్రవాసి ప్రజావాణిలో మూడు దరఖాస్తులు ఇచ్చారు. ఇతర శాఖలకు సంబంధించి 75 దరఖా స్తులు వచ్చాయని ప్రజావాణి అధికారులు తెలి పారు. గతంలో తాము సమస్యలు చెప్పే అవకాశం ఉండేది కాదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యల్ని పరిష్కరించడం ఆనందంగా ఉందని ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదు దారులు అన్నారు.
సమస్య పరిష్కారం కోసం నేరుగా అధికారులకు ఫోన్ చేయడంతో సత్వర పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. శుక్రవారం ప్రజావాణిలో ముఖ్యమంత్రి సహయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి చెక్లు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకున్న చర్యలతో ఏండ్లుగా పరిష్కారం నోచుకోని ఎన్నో సమస్యలు ఒక కొలిక్కి వస్తున్నాయని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు. దొరల రాజ్యంలో దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారనీ, సీఎం ఒక్కొక్క సమస్యను చక్క దిద్దేందుకు ఎంతో కషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది అని ప్రజా వాణి కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి జి.చిన్నారెడ్డి నోడల్ అధికారిగా దివ్య దేవరాజన్ , ఐఏఎస్ విశేష మైన సేవలు అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
ప్రజావాణిలో 232 దరఖాస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES