- Advertisement -
– నామినేషన్ ల సామాగ్రి సిద్దం: ఎంపీడీఓ అప్పారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలో ఈ నెల 30 నుండి నామినేషన్ స్వీకరణ ఉండటంతో సామాగ్రి సిద్దం చేస్తున్నాం అని ఎంపీడీఓ అప్పారావు అన్నారు. ఆయన శుక్రవారం విలేకర్లు సమావేశం లో మాట్లాడారు. వచ్చే నెల 14 వ తేదీన జరిగే పోలింగ్ కోసం వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున 234 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసాం అని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించడానికి పటిష్టం ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు.
- Advertisement -



