నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు – 2026 గురువారం నాటికి రెండో రోజు కు చేరాయి. పరీక్షా కేంద్రాలు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఐ నాగరాజు, ఎస్సై అఖిల లు కేంద్రాల వద్ద ఇద్దరేసి చొప్పున పోలీస్ సిబ్బందిని నిఘా పెట్టారు. మూడు కేంద్రాల్లో 722 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 711 మంది పరీక్షలకు హాజరు అయ్యారు.11 మంది పరీక్షలకు హాజరు కాలేదు. మూడు కేంద్రాల డిపార్ట్మెంట్ ఆఫీసర్, సీఎస్ లు కోళ్ళ శ్రీనివాస్, సత్య శ్రీధర్, ఝాన్సీ, సంగీత, రాంబాబు, ఎల్ ఎస్ ప్రసాద్ లు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.
కేంద్రం అలాట్మెంట్ హాజరు గైర్హాజరు
జీజేసీ 309 302 07
జీఎంఆర్ జేసీ 141 140 01
వీకేడీవీఎస్ఆర్ జేసీ 272 269 03
మొత్తం 722 711 11



