Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి 

- Advertisement -

– రైలురోకో చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
నవతెలంగాణ – కామారెడ్డి 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రైలు రోకో నిర్వహించారు. మంగళవారం కవిత రైలు పట్టాలపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బీసీ బిల్లు అమలు కోసం తెలంగాణ బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదింప చేయలేని బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో 17 శాతం మాత్రమే రిజర్వేషన్ అమలు చేయడం పట్ల మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు వచ్చి కవితను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -