- Advertisement -
– నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
నవతెలంగాణ – ధరూరు
జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నుంచి ఎగువ ప్రాంతం నుంచి 4 లక్షల 8వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దాంతో 44 గేట్లు ఎత్తి శ్రీశైలం జలాశయంలోనికి 4 లక్షల 18 వేల 912 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల నీటిమట్టం సామర్థ్యం 9.965 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.695 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎడమ కాల్వకు 820 క్యూసెక్కులు, కుడికాలువకు 470 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు.
- Advertisement -