రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు ఆదేశాలు
వెంటనే విధుల్లో చేరాలని మున్సిపల్ శాఖ ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 47 మందిని బదిలీ చేస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కువ కాలం ఒకే చోట పనిచేయడం, స్థానికులుగా ఉండడం వంటి కారణాల రిత్యా ఈసీ బదిలీలకు ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే విధుల్లో చేరాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. లేనిచో నిబంధనల మేరకు తగిన చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.





