నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఒక శుభవార్తను అందించింది. నగరాలు, పట్టణాల్లో విద్య వ్యాపారంగా మారిన ఈ తరుణంలో, సామాన్య, మధ్యతరగతి వర్గాలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో తమ పిల్లలను చేర్పించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం వరకు రాయితీ కల్పించాలని డీఈవో ఆర్. రోహిణి యాజమాన్యాలకు సూచించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆమె నిన్న విడుదల చేశారు.
ఈ అంశంపై హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (హెచ్యూజే – టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్షుడు బి. అరుణ్ కుమార్, కార్యదర్శి బి. జగదీశ్వర్ చేసిన విజ్ఞప్తి మేరకు డీఈవో రోహిణి సానుకూలంగా స్పందిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ఈవోలు, డిప్యూటీ ఈఓఎస్ (ఎంఈవో)లు తగు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
ఈ సందర్భంగా డీఈవో రోహిణికి హెచ్యూజే – టీడబ్ల్యూజేఎఫ్ నేతలు అరుణ్ కుమార్, జగదీశ్వర్లు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని హైదరాబాద్లోని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES