Saturday, June 28, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్టెన్త్‌ సప్లిమెంటరీలో 73.35 శాతం ఉత్తీర్ణత

టెన్త్‌ సప్లిమెంటరీలో 73.35 శాతం ఉత్తీర్ణత

- Advertisement -

బాలికలదే పైచేయి
వంద శాతం ఉత్తీర్ణతతో జనగామ ప్రథమం
55.90 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి చివరిస్థానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 42,834 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 38,741 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. వారిలో 28,415 (73.35 శాతం) ఉత్తీర్ణత పొందారని తెలిపారు. వారిలో 23,976 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, 17,034 (71.05 శాతం) మంది పాసయ్యారని పేర్కొన్నారు. 14,765 మంది బాలికలు పరీక్షలు రాస్తే 11,381 (77.08 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. బాలురు కన్నా బాలికలు 6.03 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. రాష్ట్రంలో జనగామ జిల్లా వంద శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ జిల్లా నుంచి 75 మంది పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారని వివరించారు. 55.90 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసి సంగారెడ్డి జిల్లా చివరిస్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ జిల్లా నుంచి 195 మంది పరీక్షలు రాస్తే, 109 మంది ఉత్తీర్ణత పొందారని పేర్కొన్నారు. కొంత మంది విద్యార్థుల ఫలితాలను విత్‌ హెల్డ్‌లో పొందుపర్చామని తెలిపారు. వారి ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను షషష.bరవ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని వివరించారు. పది రోజుల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
రీకౌంటింగ్‌ దరఖాస్తు గడువు జులై 7
పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు మార్కులను తిరిగి లెక్కించడం (రీకౌంటింగ్‌) కోసం దరఖాస్తు గడువు వచ్చేనెల ఏడో తేదీ వరకు ఉందని కృష్ణారావు పేర్కొన్నారు. ఎస్‌బీఐ బ్యాంకు ద్వారా చలానా ద్వారా చెల్లించి దరఖాస్తులను నేరుగా కానీ, పోస్టు ద్వారా కానీ తమ కార్యాలయాలనికి పంపించాలని సూచించారు. విద్యార్థులు సంబంధిత పాఠశాలలో హాల్‌టికెట్లు, మెమో కాపీతోపాటు రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తులను వచ్చేనెల ఏడో తేదీ వరకు సమర్పించాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి డీఈవో కార్యాలయానికి సమర్పించిన దరఖాస్తులను మాత్రమే అంగీకరించబడతాయని స్పష్టం చేశారు. రీవెరిఫికేషన్‌ కోసం పోస్టు ద్వారా పంపిన దరఖాస్తులను ఆమోదించబోమని వివరించారు. రీవెరిఫికేషన్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని తెలిపారు. రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులు రీకౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (డీడీ)లను అంగీకరించబోమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -