టీజీఎస్పీడీసీఎల్లో అక్రమార్కులు
ఆన్లైన్లో లంచాలు తీసుకున్నట్టు గుర్తింపు
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్లో అవినీతి ఇంజినీర్లపై వేటు పడింది. బుధవారం ఒకేసారి 8 మంది ఇంజినీరింగ్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్కు గురైన వారిలో ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు ఉన్నారు. యాంటీ బ్రైబరీ సెల్కు వచ్చిన ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్ విభాగం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బోర్డుల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ మంజూరు వంటివాటికి విద్యుత్ ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్టు వెల్లడైంది. ఫోన్పే వంటి డిజిటల్ పేమెంట్ ద్వారా లంచాలు స్వీకరించినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.



