Wednesday, June 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు

తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాలో జమ చేసి తీరుతామని డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఆయన మధిర నియోజకవర్గం బోనకల్ మండలం జానకిపురంలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. ఈనెల 16న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు సోదరులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా నిధులను జమ చేస్తూ వస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు.
రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1,49,39,11 కోట్ల ఎకరాలకు తొమ్మిది వేల కోట్లు జమ చేయనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్తు, రైతు భరోసా, రైతు బీమా వంటి కార్యక్రమాలతో ప్రతి సంవత్సరం రైతుల కోసం 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం, ఐదు సంవత్సరాల కాలంలో రైతుల కోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. పదేళ్లు పరిపాలించిన వారు వరి వేస్తే ఊరే అన్నారు, మేము వ్యవసాయాన్ని పండుగల మారుస్తున్నాం, సరిగ్గా వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను జమ చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చి వరి ఉత్పత్తి పెంచి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాం అన్నారు. వరితోపాటు ఇతర పంటల ఉత్పత్తి రాష్ట్రంలో గణనీయంగా పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -