Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణిలో 90 దరఖాస్తులు

ప్రజావాణిలో 90 దరఖాస్తులు

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ సోమవారం 90 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించి ఆయా దరఖాస్తులు అధికారులకు ఇస్తూ పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు విక్టర్ మదన్ మోహన్, సీఈఓ చందర్, ఆర్డీవో వీణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -