- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి 91 దరఖాస్తులు వచ్చాయని జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించి ఆయా శాఖలకు సంబంధించిన వివిధ రకాల సమస్యల పరిష్కారానికి అధికారులకు అర్జీలను ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



