Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంరూ.62వేల కోట్లతో 97 తేజస్‌ ఫైటర్‌జెట్లు

రూ.62వేల కోట్లతో 97 తేజస్‌ ఫైటర్‌జెట్లు

- Advertisement -

హెచ్‌ఏఎల్‌తో రక్షణశాఖ ఒప్పందం
న్యూఢిల్లీ : వాయుసేనలో కీలక సేవలందిం చిన మిగ్‌-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలకనున్న రక్షణ శాఖ.. వీటి స్థానంలో తేజస్‌ జెట్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ.62,370 కోట్లతో 97 తేజస్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి హిందు స్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)తో రక్షణశాఖ ఒప్పందం చేసుకొంది. ఇందుకోసం ప్రధాని మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీఎస్‌ఎస్‌) గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిన నెలలోనే ఈ ఒప్పందం పూర్తయ్యింది. మిగ్‌-21 యుద్ధవిమానాల స్థానంలో ఈ సింగిల్‌ ఇంజిన్‌ ఎంకే-1ఏ తేజస్‌ జెట్‌లను ప్రవేశ పెడుతున్నారు. తాజాగా సమీకరిస్తున్న 97 విమా నాల్లో.. 68 యుద్ధవిమానాలు, 29 ట్విన్‌ సీటర్స్‌ ఉండనున్నట్టు రక్షణశాఖ వెల్లడించింది.

ఈ అత్యా ధునిక ఫైటర్‌ జెట్లలో ఉత్తమ్‌ ఏఈఎస్‌ఏ రాడార్‌, స్వయం రక్షా కవచ్‌ వ్యవస్థలతోపాటు కంట్రోల్‌ యాక్యుయేటర్‌లు ఉంటాయి. వీటిలో 64శాతానికి పైగా దేశీయ కంటెంట్‌, 67 దేశీయ ఉత్పత్తులు ఉండనున్నాయని రక్షణశాఖ పేర్కొంది. 2027-28 నుంచి వీటి సేకరణ ప్రారంభమవుతుందని, తద్వారా వాయుసేన సామర్థ్యాలు పెరగడంతోపాటు ఆత్మనిర్భర భారత్‌, భారత రక్షణ సంసిద్ధతలను మరింత పెంపొంది స్తుందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు వచ్చే ఆరేండ్లలో ఏడాదికి 11,750 ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపాయి. అయితే, హెచ్‌ఏఎల్‌తో ఇది రెండో ఒప్పందం కాగా.. రూ.48వేల కోట్లతో 83 తేజస్‌ యుద్ధవిమానాల సమీకరణకు రక్షణ శాఖ 2021 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -