మహిళలు వ్యాపారవేత్తల్లా ఆలోచించాలి

Women should think like entrepreneurs– ‘అడుగుదూరంలో అన్ని సేవలు’ కార్యాక్రమంలో
– రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా
– రైతు పంటను ఎఫ్‌పీవోలో విక్రయించుకోవాలి
– మహిళలు సమాజానికి ఆర్థిక పాఠాలు నేర్పాలి
నవతెలంగాణ-చెన్నారావుపేట
సమైక్య ప్రతినిధులు వ్యాపారవేత్తలవలే ఆలోచిస్తూ రైతులకు అధిక ధరలు కల్పించే సంస్థలుగా ఎఫ్‌పిఓలు ఎదగాలని రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా సూచించారు. సోమవారం మండల పరిధిలోని ఎఫ్‌పిఓ అధ్యక్షురాలు చిర్ర సృజ న ఆధ్వర్యంలో నిర్వహించిన అడుగుదూరంలో అన్నిసేవలు కార్య క్రమానికి జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య, అడిషనల్‌ జిల్లా కలెక్టర్‌ అశ్విని తానాజీవాకాడేలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు వి విధరకాల రుణాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని దానికి త గిన సహాయం చేయడానికి మావంతు కృషి చేస్తామన్నారు. రైతులకు ఆదాయం ఇచ్చే పంటలను ప్రోత్సహించాలని మహిళ లు గొప్ప లక్ష్యాలను ముందుపెట్టుకొని మరిన్ని అద్భుత విజయా లను సాధించడానికి కృషి చేయాలన్నారు.
డ్రోన్లతో అధిక లాభాలు.
జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్యం మాట్లాడుతూ వ్యవసాయానికి డ్రో న్లతో అధికలాభాలు సాధించవచ్చునని మహిళలు డ్రోన్ల, ఎంబ్రా యిడరీ శిక్షణ తీసుకొని విజయాలను సాధించాలన్నారు.
సాధించిన విజయాలు ….
ఎఫ్‌పిఓ అధ్యక్షరాలు చిర్ర సృజన మాట్లాడుతూ అక్షయ ఎస్‌ పిఓ ద్వారారూ.1.40కోట్ల వ్యా పారం నిర్వహించగా రూ.4, 33,415 ఆదాయం, అద్దె కేం ద్రం ద్వారా రూ.24 లక్షల టర్నవర్‌ సాధించి రూ.9.46 లక్షల ఆదాయం సమకూర్చు కోవడం జరిగిందన్నారు.
దక్కని గౌరవం ….
గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సంఘాల సభ్యులకు అడుగుదూరంలో అన్నిసేవా కా ర్య క్రమాలు వివిధ ప్రోటోకాల్‌ నాయకులు, ఉన్నత అధికారులు, వా రివారి సీట్లలో ఆసీనులుకాగా తహశీల్దార్‌ శ్రీనివాసఫణి కుమార్‌ కు మాత్రం అధికారులకు సంబంధించిన సీట్లలో గౌరవం దక్కక పోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే తాత్కలిక మరమ్మతులు ….
మండల కేంద్రంలోని గత సంవత్సరం నుండి రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డు పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వర్షాలతో రో డ్లు జలమయం కావడంతో ప్రమాదాలు జరుగుతున్న పట్టించు కోని ప్రజాప్రతినిధులు మహిళా సంఘాల సభ్యులకు అడుగు దూ రంలో అన్నిసేవా కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రప్రిన్సిపాల్‌ సెక్రట రీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్యల రాకతో రోడ్డును తాత్కాలిక పనులు చేపట్టారు. అధికారులు, నాయకులు వస్తేనే పనులు చేపడతారా! అని ప్రజల సమస్యలు నాయకులకు తెలియవా అని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రాజెక్టు అధికారులు వైన్‌ రెడ్డి, రజిత, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మట్టపల్లి సంపత్‌ రావు, అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్పీఎంలు శ్రీనివాస్‌, వీరమల్లు, ఎంపీడీవో, ఎంపీపీ విజేందర్‌, జెడ్పీటీసీ పత్తినాయక్‌, సర్పంచ్‌ మల్లయ్య, జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ సరిత, మండల ప్రాజెక్టు మేనేజర్‌ ముక్కె ర ఈశ్వర్‌, ఏపిఎంలు శ్రీను, కి షన్‌, కృష్ణమూర్తి, కిరణ్‌ ఎఫ్‌ఈఓ మండలాల కమ్యూనిటీ కో-ఆరి ్డనేటర్లు, నెక్కొండ, రాయపర్తి, పర్వతగిరి, సంగెం మండలాల సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love