- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో శనివారం ఏ ఉదయం 3 గంటల నుండి బందు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని బస్ డిపో ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీఐ నాగార్జున మాట్లాడుతూ ఉద్యమకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని వారికి సూచించారు. బిసి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనను శాంతియుత వాతావరణంలో చేయాలని సి నాగార్జున అన్నారు ఎట్టి పరిస్థితిలోనూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని వారు అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు
- Advertisement -