- Advertisement -
నవతెలంగాణ – నకిరేకల్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ను గెలిపించాలని కోరుతూ మంగళవారం బోరబండ డివిజన్ లోని 314, 315, 316 బూతులలో మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సునీత ను గెలిపించాలన్నారు. వారి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
- Advertisement -