- Advertisement -
నవతెలంగాణ – మోర్తాడ్
మండలం దొనకల్ గ్రామానికి చెందిన బోలమాల తరుణ్ 22 ప్రమాదవశాత్తు అకాల మరణం పొందాడు. విషయం తెలుసుకున్న స్థానిక జూనియర్ కళాశాల లెక్చరర్ పరశురాం పూర్వ విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని విషయాన్ని సూచించడంతో ఓ విద్యార్థి తన వాట్సాప్ స్టేటస్ ద్వారా ఎవడు వేల రూపాయలను జమ చేసి సార్కి ఇవ్వడంతో డబ్బులను మృతి కుటుంబానికి అందజేశారు. కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఇదేవిధంగా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల హిస్టరీ అధ్యాపకులు పరశురాం, పూర్వ విద్యార్థి నవీన్ ఉన్నారు.
- Advertisement -



