- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్లో ఛఠ్ పూజ ప్రారంభోత్సవాల సందర్భంగా ‘నహయ్ ఖాయ్’ ఆచారాల సమయంలో విషాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో దాదాపు 11 మంది మరణించారు. వీరిలో పిల్లలు, యువకులే అధికంగా ఉన్నారు. పాట్నాలో గంగానదిలో స్నానం చేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు, వైశాలిలో ఒక బాలుడు, జముయిలో ఇద్దరు యువకులు, బెగుసరాయ్లో ఒక యువకుడు, సీతామర్హిలో ముగ్గురు, కైమూర్లో ఒక బాలుడు మునిగి మరణించారు. పండుగ వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -



