- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి , బిబిపేట్
బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్య గారి రజని – సుభాష్ రెడ్డి ల కుమారుడు నిహాంత్ రెడ్డి వివాహము నవంబర్ 7 శంషాబాద్ హైదరాబాదులో జరిగే వివాహ పత్రికను గతంలో జనగామ గ్రామానికి అనుబంధ గ్రామంగా ఉన్న సీతారాం పల్లి గ్రామంలో ఇంటింటికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవి పేట మండలం మాజీ వైస్ ఎంపీపీ కప్పేర రవీందర్ రెడ్డి , జనగామ గ్రామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, సైదు గారి అశోక్ గౌడ్, జీవన్ రెడ్డి, నీల స్వామి, పాత స్వామి, జాలిగామ నాంపల్లి, వెన్నెల సిద్ధరాములు, జాలిగామ రాజు, వెన్నెల రాజు, గంగిరెడ్డి రమేష్, పుట్టబలనర్సు, పుట్టముత్యం, జాలిగామ శ్రీనివాస్, చింట్టు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


