నవతెలంగాణ – హైదరాబాద్: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలో వెలితే.. ఎల్కతుర్తి మండలం గోపాలపురం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు పెండ్లి బృందంతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని బోర్వెల్స్ లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్పల్లికి చెందిన యువతిని, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడితో పెండ్లి జరిపించారు. వివాహ వేడుకల్లో భాగంగా వధువు తరుఫు బంధువులు వరుడి ఇంటికి వెళ్లారు. తిరిగి మహబూబాబాద్కు వెళ్తుండగా గోపాలపురం క్రాస్ రోడ్డు వద్ద బొలేరో వాహనాన్ని ఆపారు. దీంతో వెనుక నుంచి వచ్చిన లారీ దానిని ఢీకొట్టింది. ఘటనాస్థలంలో ఒకరు మృతిచెందగా, ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. ప్రమాదం ధాటికి బొలేరో తుక్కుతుక్కు అయింది. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్
పెండ్లి బృందం వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    