- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
- Advertisement -



