- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో బుధవారం సూర్యాస్తమయం అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా, చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా పెద్దగా పట్టణ ప్రజలకు కనిపించి, అద్భుతంగా ఆకాశంలో కనువిందు చేశాడు. దీంతో సాధారణంగా కంటే 14% పెద్దగా 30% కాంతివంతంగా 6 గంటల 49 నిమిషాలకు కనిపించినట్లు, దీన్ని బి ఫర్ సూపర్ మూన్ గా విశ్లేషకులు తెలిపారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని పట్టణ ప్రజలు వీక్షించారు. చంద్రుడు తన కక్షలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు సూపర్ మూన్ చంద్రుడుగా ఏర్పడతాడని పట్టణంలో వాట్స్అప్ గ్రూప్ లలో ప్రజలు విశ్లేషణ చేశారు.
- Advertisement -



