- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 850కిపైగా పాయింట్ల నష్టంతో మొదలైంది. నిఫ్టీ కూడా 232 పాయింట్లు పతనమైంది. ప్రధాని మోడీ బంగారంపై చేసిన వ్యాఖ్యలతో పాటు ఇరాన్తో అమెరికా శాంతి ప్రతిపాదనలు తిరస్కరించడం వంటి అంశాలు ప్రభావం చూపించాయి. ఈ రోజు ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్ 908 పాయింట్లను నష్టపోయి 76,414 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 266 పాయింట్లను కోల్పోయి 23,909 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
- Advertisement -



