- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధిలో డ్రగ్స్ సేవించి వ్యక్తి మృతి చెందాడు. మొబైల్ టెక్నీషియన్గా పని చేస్తున్న అలీ(28) డ్రగ్స్ డోస్ ఎక్కువ కావడంతో చనిపోయాడు. రాత్రి స్నేహితులతో కలిసి మోతాదుకు మించి డ్రగ్స్ సేవించినట్టు పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ ముఠా అరెస్టు
రాజేంద్రనగర్లో డ్రగ్స్ ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు బస్సులో మాదకద్రవ్యాలను తీసుకొస్తుండగా ముగ్గురిని పట్టుకున్నారు. మరో ముగ్గురు వినియోగదారులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 17 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -



