- Advertisement -
నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
తెలంగాణ రాష్ట్రం లో ఈనెల 9 న టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర తైక్వాండో పోటీలకు నిజామాబాద్ అమెచ్యూర్ అసోసియేషన్ టైక్వాండో క్రీడాకారులు అండర్ 14 ఏజ్ గ్రూప్ , సీనియర్ టైక్వాండో క్రీడాకారులు పోటీలకు ఎంపికయ్యారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అమేజింగ్ టైక్వాండో ప్రెసిడెంట్ బస్వ శ్రీనివాస్ హాజరై కొన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులు అందరికి పోటీలలో బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయికి ఎంపికవ్వాలని, జిల్లా కి , తల్లిదండ్రులకు, గురువుకి అందరికీ మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
- Advertisement -



