- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
రోడ్డు ప్రమాదాల కారణంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎన్ హెచ్ 44 జాతీయ రహదారి ప్రక్కన ఉన్న టోల్ ప్లాజా వద్ద ఇరువైపులా ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి మద్యం తాగి వాహనం నడుపుతున్న వాహనదారులపై కేసు నమోదు చేశారు. సిఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా 27 కేసులు నమోదు చేసి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. ఈ తనిఖీలలో ఎస్సై ఆంజనేయులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
- Advertisement -



