- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని గౌరారంలో పశు వైద్యాధికారి వేణు ఆధ్వర్యంలో శనివారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువులకు చికిత్సలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వాతావరణంలో మార్పుల వల్ల పశువులు రోగాలబారిన పడకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వో ఎస్ గంగాధర్, మట్టా రెడ్డి గోపాలమిత్రలు రాములు, రమేష్, శివాజీ, ప్రసాద్ పాల్గొన్నారు.
- Advertisement -



