- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా వీరబాబు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ వీరబాబు మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జూదం, అక్రమ మద్యం, తదితర వాటి పై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. నూతన ఎస్సై కి పోలీస్ సిబ్బంది, మండల నాయకులు ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై శంషూద్దీన్ ఎస్పీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు.
- Advertisement -



