Thursday, November 13, 2025
E-PAPER
Homeజాతీయంరాజ్యాంగ బిల్లు పరిశీలనకు జేపీసీ ఏర్పాటు

రాజ్యాంగ బిల్లు పరిశీలనకు జేపీసీ ఏర్పాటు

- Advertisement -

కమిటీకి చైర్‌పర్సన్‌గా అపరాజిత సారంగి నియామకం
న్యూఢిల్లీ : రాజ్యాంగ (130 సవరణ) బిల్లు, 2025 జమ్మూ కాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2025.. కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు 2025లను పరిశీలించడానికి పార్లమెంట్‌ జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసింది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా పార్లమెంటు సభ్యురాలు అపరాజిత సారంగిని నియమించారు. లోక్‌సభ బులెటిన్‌ ప్రకారం లోక్‌సభ , రాజ్యసభ రెండింటి నుంచి మొత్తం 31 మంది సభ్యులను కమిటీ నియమించింది. లోక్‌సభ నుంచి రవిశంకర్‌ ప్రసాద్‌, భర్తృహరి మహతాబ్‌, ప్రదాన్‌ బారుV్‌ా, బ్రిజ్మోహన్‌ అగర్వాల్‌, విష్ణు దయాళ్‌ రామ్‌, సుప్రియా సూలే , అసదుద్దీన్‌ ఓవైసీ సభ్యులుగా ఉన్నారు. హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కూడా ఉన్నారు.

రాజ్యసభ నుంచి నామినేట్‌ చేయబడిన సభ్యులలో బ్రిజ్‌ లాల్‌, ఉజ్వల్‌ నికం, నబమ్‌ రెబియా, డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, సుధా మూర్తి, బీరేంద్ర ప్రసాద్‌ బైశ్యా, ఎస్‌. నిరంజన్‌ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ), ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యులు కమిటీలో చేరకపోవడం గమనార్హం. జాయింట్‌ కమిటీ మూడు బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్ర చర్చల తర్వాత పార్లమెంటుకు తన సిఫారసులను సమర్పిస్తుంది. ఇంతలో, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 1 నుంచి 19 వరకు జరుగుతాయని ప్రకటించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను అధ్యక్షుడు ముర్ము ఆమోదించారు. పార్లమెంటు సజావుగా జరిగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -