- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏది కొనాలన్నా పావుకేజీ రూ.30 పైనే ఉండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పలు రకాల కూరగాయలు కేజీ రూ.100-120 పలుకుతున్నాయి. రైతు బజార్లతోపాటు వారపు సంతల్లోనూ ఇవే ధరలు ఉంటున్నాయని వాపోతున్నారు. ఇక ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినడంతోనే ధరలు పెరిగాయని సదరు వ్యాపారులు చెబుతున్నారు.
- Advertisement -



