- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



