- Advertisement -
హైదరాబాద్ : 2025 పోలో చాంపియన్షిప్స్లో తెలంగాణ పోలో క్లబ్ బోణీ కొట్టింది. హైదరాబాద్లోని అజీజ్నగర్లోని హెచ్పిఆర్సిలో శుక్రవారం ఆరంభమైన పోటీల్లో ఢిల్లీ డేర్డెవిల్స్పై 10-09తో తెలంగాణ పోలో క్లబ్ విజయం సాధించింది. తొలుత 0-3తో వెనుకంజ వేసిన తెలంగాణ పోలో క్లబ్.. వరుసగా 4-1, 2-2, 4-3తో పుంజుకుని మెరుపు విజయం నమోదు చేసింది. తెలంగాణ పోలో క్లబ్ తరఫున రాజీవ్ రెడ్డి (5 గోల్స్), కౌశిక్ కుమార్ (4 గోల్స్), అరుణ్ జూపల్లి (1 గోల్) రాణించారు.
- Advertisement -



